జగిత్యాల జిల్లా రంగాపూర్ లో దొంగల బీభత్సం
జగిత్యాల, సెప్టెంబర్ 04 (సమాజహితం) : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రంగాపూర్ లో దొంగల బీభత్సం సృష్టించారు. రంగాపూర్ గ్రామంలోని వర్ధినేని రాజ మనోహర్రావు ,వద్దినేని బాబురావు, వర్ధినేని రాజేశ్వరరావు వర్ధినేని బాలకృష్ణ రావు అనే నలుగురి ఇళ్లల్లోకి చొరబడిన దొంగలు సుమారు నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల నగదు ఎతికెళ్లారు.శుభకార్యం ఉండటంతో నాలుగు కుటుంబ సభ్యులు ఇతర గ్రామాలకు వెళ్లారు, ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దొంగలు 4 ఇళ్లల్లో చొరబడి ఐదుతులాల బంగారం,లక్షా నగదు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు.