Samajahitham

రాహుల్ సోదరి చదువుకు పూర్తి బాధ్యత మాదే: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

ఇటీవలే మరణించిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబానికి ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరామర్శ. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాహుల్ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయాన్ని […]

రాహుల్ సోదరి చదువుకు పూర్తి బాధ్యత మాదే: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ Read More »

శిలాఫలకంపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడు, సఖినేటిపల్లి గ్రామాలలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. ఈ సందర్భంగా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ద్వంసం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు

శిలాఫలకంపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు! Read More »

బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో మానవ పుర్రె, ఎముకలు లభ్యం ..!!

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి డైరీ ఫార్మ్ సమీపంలో చెట్ల పొదలలో పోలీసులకు మానవ అస్తిపంజరం లోని పుర్రె,ఎముకలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. తెల్లవారుజామున ఓ వ్యక్తి అటువైపుగా వెళ్తూ చెట్టుకు వేలాడుతున్న పుర్రె ఎముకలను చూసి భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పుర్రెతోపాటు ఎముకలను స్వాధీనం చేసుకుని డిఎన్ఏ పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఈ పుర్రె ఎముకల కు

బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో మానవ పుర్రె, ఎముకలు లభ్యం ..!! Read More »

హైదరాబాద్ లో బీజేపీ నేతల అరెస్ట్..తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నివాసం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడంపట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందుకు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే ‘గురవింద గింజ’ సామెత గుర్తుకొస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్ లో బీజేపీ నేతల అరెస్ట్..తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Read More »

ఆయుధాలతో కొట్టి..కరీంనగర్ లో భారీ దోపిడీ!

కరీంనగర్ లోని భగత్ నగర్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతుల పై ఆయుధాలతో విరుచుకుపడిన దొంగలు విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆయుధాలతో బెదిరించి వారి వద్ద ఉన్న 50 తులాల బంగారం, రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా దోపిడీ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి లైట్ ఆఫ్

ఆయుధాలతో కొట్టి..కరీంనగర్ లో భారీ దోపిడీ! Read More »

ఆర్టీసీ బస్సు చోరీ.. కోరుట్లలో సినిమాను తలపించిన ఛేజింగ్..!!

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సు అపహరణ కలకలం రేపింది. డిపోలో నిలిపి ఉంచిన బస్సును గుర్తుతెలియని వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా తీసుకెళ్లడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. డ్రైవర్ చాకచక్యం, పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బస్సు మార్గమధ్యంలో పలువురిని ఢీకొట్టినట్లు సమాచారం. చివరకు ఇబ్రహీంపట్నం మండలం హనుమాన్ ఆలయం సమీపానికి చేరుకున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోవడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని

ఆర్టీసీ బస్సు చోరీ.. కోరుట్లలో సినిమాను తలపించిన ఛేజింగ్..!! Read More »

మంగళగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేశ్

మంగళగిరి, జూలై 22: మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి కలలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచేలా మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ‘మన ఇల్లు–మన లోకేశ్‌’ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండో రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను

మంగళగిరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేశ్ Read More »

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!!

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!! తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగో వారం కూడా సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. వరుసగా నాలుగో వారం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత..!! Read More »

Powered by WordPress